భారతదేశం, ఏప్రిల్ 23 -- Illu Illalu Pillalu April 23 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ ను ధీరజ్, నర్మద పట్టుకుంటారు. దీంతో భాగ్యం, శ్రీవల్లి వణికిపోతారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 23 ఎపిసోడ్ లో చూసేయండి.

చంపేస్తానని ధీరజ్ భయపెట్టడంతో లారీ డ్రైవర్ నిజం చెప్పేస్తాడు. సేనాపతి పేరు దాచిపెట్టి, భాగ్యం పేరును ఆ డ్రైవర్ చెప్తాడు. దీంతో నర్మద, ధీరజ్ షాక్ అవుతాడు. చందు వాళ్ల అత్తామామనే యాక్సిడెంట్ చేయమని చెప్పారని చెప్పిన డ్రైవర్ తప్పించుకొని పారిపోతాడు.

బావ ప్రాణాలు తీయాలని చూసిన తర్వాత వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని నర్మద అంటుంది. నర్మద చెప్పడంతో ప్రేమకు ధీరజ్ కాల్ చేసి రమ్మంటాడు. మరోవైపు భాగ్యం, శ్రీవల్లి, ఇడ్లీ బాబాయ్ తెగ టెన్షన్ పడతారు....