భారతదేశం, మార్చి 16 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ఉన్నప్పటికీ, ఐడీబీఐ బ్యాంక్​లో ఇన్వెస్ట్​ చేసిన వారు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు! ఇందుకు కారణం ఐడీబీఐ బ్యాంక్​ షేరులో కనిపిస్తున్న భారీ పతనం. ఉదయం ట్రేడింగ్​ సెషన్​ ఓపెన్​ అవుతూనే ఈ ఐడీబీఐ బ్యాంక్​ లిమిటెడ్​ షేర్లు ఏకంగా 15శాతం క్రాష్​ అయ్యాయి.

ఈ బ్యాంక్​లో మెజారిటీ వాటాను విక్రయించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు రద్దయ్యే అవకాశం ఉందన్న నివేదికల మధ్య ఈ పతనం సంభవించింది.

ఉదయం ఓపెన్​ అవుతూనే.. బీఎస్​ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేరు ధర 15.34% తగ్గి రూ. 78.05కి చేరుకుంది. ఇది 52 వీక్​-లో స్థాయి అయిన రూ. 72.04 కి చేరువలో ఉంది. ట్రేడింగ్ వాల్యూమ్స్ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయి.

ఇక ఉదయం 10 గంటల 20 నిమిషాల ప్రాంతంలో ఈ స్టాక్​ 14.95శాతం నష్టాలతో 78....