భారతదేశం, మార్చి 29 -- కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్​సీఈ) నిర్వహించిన 10వ తరగతి (ఐసీఎస్​ఈ), 12వ తరగతి (ఐఎస్​సీ) బోర్డు పరీక్షలు ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఈ పరీక్షల్లో ఐసీఎస్ఈ మార్చి 30తో, ఐఎస్‌సీ ఏప్రిల్ 6వ తేదీతో పూర్తి కానున్నాయి. పరీక్షలు ముగిసిన వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రుల చూపు ఫలితాలపై ఉంటుంది. ఎగ్జామ్​ రిజల్ట్స్​ ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తుంటారు.

గత గణాంకాలను పరిశీలిస్తే, 2025లో ఏప్రిల్ 30న, 2024లో మే 6వ తేదీన ఫలితాలు విడుదలయ్యాయి. ఇదే ధోరణిని బట్టి చూస్తే, ఈ ఏడాది కూడా ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో ఐసీఎస్​ఈ, ఐఎస్​సీ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం మెండుగా ఉంది. సాధారణంగా బోర్డు అధికారులు ఒకే రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా రెండు తరగతుల ఫలితాలను విడుదల చేస్తారు. ...