భారతదేశం, మార్చి 15 -- ఇండియా రోడ్లపై కనిపంచే బడా ఎస్​యూవీల్లో హ్యుందాయ్​ టక్సన్​ ఒకటి. కానీ ఈ 5 సీటర్​ని హ్యుందాయ్​ సంస్థ గతేడాది నవంబర్​లో ఇండియాలో డిస్కంటిన్యూ చేసింది. సైలెంట్​గా తన వెబ్​సైట్​ నుంచి ఈ మోడల్​ని దింపేసింది. ఆ తర్వాత కొత్త బుకింగ్​లను సైతం ఆపేసింది. 2022లో భారత్‌లో విడుదలైన నాలుగో తరం టక్సన్, అప్పట్లో హ్యుందాయ్​కి చెందిన అత్యంత అధునాతన సాంకేతికత ఫీచర్లతో కూడిన ఎస్‌యూవీగా పేరుగాంచింది. ప్రస్తుతం ఈ మోడల్ స్థానంలో ఏ కారు వస్తుంది లేదా ఎప్పుడు మళ్లీ విడుదల అవుతుందనే దానిపై కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

అయితే, నెక్ట్స్​ జనరేషన్​ టక్సన్​కి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చూస్తుంటే, ఈ మోడల్​కి సంస్థ భారీ మార్పులే చేసి, రీ-లాంచ్​ చేసేందుకు ప్రయత్నిస్తోందని అనిపిస్తోంది.

భారత్‌లో నిలి...