భారతదేశం, జూలై 18 -- భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) హవా రోజురోజుకూ పుంజుకుంటోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ తన ఈవీ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేయడానికి ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఒక సరికొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత్‌లో లాంచ్ చేయడానికి సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఈ కారు దేశీయ రోడ్లపై పలుమార్లు టెస్టింగ్ చేస్తూ కనిపించింది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం.. త్వరలో రాబోతున్న ఈ ఈవీ, ప్రస్తుతం ఉన్న 'క్రెటా ఎలక్ట్రిక్' కంటే కింది విభాగంలో ఉండనుంది. అంటే, హ్యుందాయ్ బ్రాండ్ నుంచి రాబోయే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇదే అయ్యే అవకాశం ఉంది. ఈ సరికొత్త ఈవీ.. కార్ ప్రియులకు 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో అందుబాటులోకి రానుంది. అత్యాధునిక టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో ర...