భారతదేశం, జూలై 18 -- HYDRAA Operation : హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఏర్పడిన 'హైడ్రా' శనివారం నలువైపులా ఉక్కుపాదం మోపింది. కబ్జాదారుల గురక పెట్టించేలా ఒకే రోజు మూడు ప్రధాన ప్రాంతాల్లో మెగా ఆపరేషన్లు నిర్వహించి, సుమారు రూ. 30 వేల కోట్ల విలువైన 840 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాల రెవెన్యూ అధికారుల నుంచి వచ్చిన అధికారిక విజ్ఞప్తుల మేరకు.. భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా రంగంలోకి దిగి ఈ భూములకు రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశాయి.

ఇందులో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండ‌లం బ‌హదూర్‌గూడ గ్రామంలోని 25, 26 స‌ర్వే నంబ‌ర్ల‌లో 650 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉండ‌గా.. ఇదే జిల్లాలోని శేరిలింగంప‌ల్లి మండ‌లం రాయ‌దుర్గంలో 84 ఎక‌రాల ప్ర‌బుత్వ భూమి...