భారతదేశం, జూన్ 27 -- HYDRAA Operation Hasmathpet : హైదరాబాద్‌ మహానగర పరిధిలో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) శనివారం మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. మేడ్చల్ - మల్కాజగిరి జిల్లా, బాలానగర్ మండలం పరిధిలోని హస్మత్‌పేటలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి విడిపించింది. సర్వే నంబర్ 01లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ దాదాపు రూ. 750 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

హైడ్రా ప్రకటనలోని వివరాల ప్రకారం.. హస్మత్‌పేట సర్వే నంబర్ 01 లో మొత్తం 108 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, అందులో ఇప్పటికే 98 ఎకరాలు రకరకాలుగా కబ్జాకు గురైంది. కబ్జాదా...