భారతదేశం, మార్చి 16 -- హైదరాబాద్ చుట్టూ ప్రతిపాదిత రీజినల్ రింగ్ రైలు కోసం కేంద్ర ప్రభుత్వం సర్వేకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు, సమీప జిల్లాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు.. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖలో ఆమోదం గురించి తెలియజేశారు. వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR) తయారీకి ఈ సర్వే మొదటి అడుగు కానుంది. రీజినల్ రింగ్ రోడ్డు వెంటే ఈ రైల్వే అలైన్‌మెంట్‌ను ఖరారు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కేంద్రమంత్రి వెల్లడించారు.

డీపీఆర్ సిద్ధమైన తర్వాత ప్రాజెక్ట్ మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వ, ఇతర వాటాదారులతో చర్చలు జరపాల్సి ఉంది. ఆ తర్వాత నీతి ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖల న...