భారతదేశం, ఏప్రిల్ 6 -- హైదరాబాద్‌లో సొంత ఇంటి కల సామాన్యుడికి మరింత భారంగా మారుతోంది. 'నోబ్రోకర్' విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. గత ఆరేళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏకంగా 81% ధరల వృద్ధిని నమోదు చేసింది. 2019లో ఉన్న ధరలతో పోలిస్తే, 2025 నాటికి సగటు చదరపు అడుగు ధర రూ. 8,326 కు చేరుకుంది. దేశవ్యాప్తంగా చూస్తే 85% వృద్ధిని సాధించిన గురుగ్రామ్ తర్వాత.. అత్యంత వేగంగా ధరలు పెరిగిన నగరంగా హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.

అయితే ధరలు కొండెక్కి కూర్చున్నా, ఇళ్ల పరిమాణం మాత్రం 'ష్రింక్‌ఫ్లేషన్' వల్ల తగ్గుతోంది. హైదరాబాద్‌లో సగటు అపార్ట్‌మెంట్ సైజు 1,068 చదరపు అడుగుల నుంచి 1,025 చదరపు అడుగులకు (సుమారు 4శాతం) పడిపోయింది. ఇది ప్రధాన నగరాలన్నింటిలోనూ కనిపిస్తున్న ట్రెండ్ అని నివేదిక పేర్కొంది.

ధరల పెరుగుదల ప్రభావం కొనుగోలు శక్తిపై తీవ్...