భారతదేశం, ఆగస్టు 22 -- హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగా చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది. నగరంలోని అత్యంత డిమాండ్ ఉన్న రాయదుర్గం ప్రాంతంలో ఉన్న ప్లాట్ నంబర్ పి1 (P1) వేలంలో ఊహించని ధరకు అమ్ముడై భూముల విలువలో కొత్త చరిత్ర సృష్టించింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) నిర్వహించిన ఈ ఈ-వేలంలో 5.25 ఎకరాల స్థలానికి ఏకంగా రూ.1,386 కోట్ల ఆదాయం వచ్చింది.

మల్టీ-యూజ్ జోన్ పరిధిలోకి వచ్చే 5.25 ఎకరాల రాయదుర్గంలోని ప్లాట్ పి1 కోసం టీజీఐఐసీ మొదట ఎకరానికి రూ.175 కోట్ల ప్రాథమిక ధర (Reserve Price) నిర్ణయించింది. అయితే వేలం ప్రారంభమైన తర్వాత ప్రముఖ డెవలపర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరికి ఈ స్థలం ఎకరానికి రూ.264 కోట్ల దక్కించుకున్నారు. అంటే రిజర్వ్ ధర కంటే ఇది ఏకంగా 50.9 శాతం ఎక్కువ ప్రీమియం సాధించింది. హైదరాబాద్‌లోని వ్యూహాత్మక కారిడార...