Hyderabad News : ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ సూసైడ్ - అసలేం జరిగింది..?
భారతదేశం, ఆగస్టు 12 -- హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఘోరం జరిగింది. అక్కడే విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ సాయికుమార్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే కానిస్టేబుల్ బలవన్మరణానికి గురైన ఘటన స్థానిక సిబ్బందిని.. ఆయన కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
వివరాల్లోకి వెళ్తే.. సాయికుమార్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి విధులకు హాజరైన ఆయన.. నైట్ డ్యూటీలో భాగంగా స్టేషన్లోనే ఉన్నారు. బుధవారం ఉదయం చూసేసరికి సాయికుమార్ పోలీస్ స్టేషన్లో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించారు. అది గమనించిన తోటి సిబ్బంది వెంటనే తేరుకుని, సీనియర్ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ వినోద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.