భారతదేశం, మార్చి 29 -- మూసీ రివర్ ప్రాజెక్టులో భాగంగా మూసీ తీరం గండిపేట - మంచిరేవులలోని చారిత్రక వీరభద్రస్వామి ప్రాంగణంలో శ్రీ మచిలేశ్వర స్వామి, శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 14 వందల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయాన్ని.. 8 ఎకరాల్లో దాదాపు రూ. 700 కోట్లతో పునర్నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ఈ ఓంకారేశ్వర దేవాలయ నిర్మాణ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ శివాలయానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ముందు భాగంలో 91 అడుగుల ఎత్తు, 9 అంతస్తుల్లో మహా రాజగోపురం నిర్మిస్తారు. ఆలయ సముదాయం 2 ప్రాకారాలతో, నాలుగు దిక్కుల 8 భారీ రాజ గోపురాలను ప్రతిష్టిస్తారు.

కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనలతో ఆలయ నిర్మాణ శైలి ఖరారైంది. ప్రధాన ఆలయ ప్ర...