భారతదేశం, జూలై 6 -- భాగ్యనగర భవిష్యత్తు ప్రజా రవాణా వ్యవస్థకు అత్యంత కీలకమైన హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మెట్రో ఫేజ్-II విస్తరణ పనులకు అవసరమైన కేంద్ర అనుమతులు మంజూరు చేయడంతో పాటు, మెట్రో ఫేజ్-Iను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిలకు ముఖ్యమంత్రి విడివిడిగా లేఖలు పంపారు.

ఇటీవల 2026 జూన్ 23, 24 తేదీలలో న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా లేఖలో గుర్తుచేశారు. ఆ సమావేశాల్లో తీసుకున్న ఉమ్మడి నిర్ణ...