భారతదేశం, ఆగస్టు 3 -- హైదరాబాద్ నగరంలో గుండెలను పిండేసే అత్యంత విషాదకర సంఘటన వెలుగుచూసింది. కన్నతల్లే కాలయమురాలై, నవమాసాలు మోసి కన్న తొమ్మిది నెలల పసిపాపను నీటిలో ముంచి ప్రాణాలు తీసింది. ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బైరామల్‌గూడ చెరువు వద్ద ఈ ఘోరం జరిగింది.

ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన లోకసాని రాజేశ్వరి (34)కి, నల్గొండ జిల్లా చింతపల్లి మండలానికి చెందిన లోకసాని రవీందర్ రెడ్డితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చిన ఈ దంపతులు గత కొన్నేళ్లుగా ఎల్బీనగర్ సమీపంలోని ఇంజాపూర్ ప్రాంతంలో నివాసముంటున్నారు. వీరికి తొమ్మిది నెలల వయసున్న 'అనురాధ' అనే కూతురు ఉంది. రవీందర్ రెడ్డి బటాసింగారం పండ్ల మార్కెట్‌లో హమాలి (కూలీ)గా పనిచేస్తుండగా, రాజేశ్వరి గృహిణిగా ఉంటోంది.

ఈ దంపతుల ...