భారతదేశం, ఆగస్టు 17 -- Hyderabad Balapur Murder Case : హైదరాబాద్ మహానగరంలో మరో దారుణ ఉదంతం కలకలం రేపింది. వివాహం విషయమై తలెత్తిన తీవ్ర వివాదం ఒక యువతి ప్రాణాలను బలిగొంది. ప్రేమించిన యువతే పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు ఒక యువకుడు ఆమెను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం (ఆగస్టు 17) వెలుగుచూసింది.

హత్యకు గురైన యువతిని బీహార్ రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల రేహానాగా పోలీసులు గుర్తించారు. నిందితుడు కూడా అదే ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల అహ్మద్ సలామ్‌గా తేల్చారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.

సోమవారం ఉదయం నిందితుడు నివాసం ఉంటున్న గదిలో నుంచి అనుమానాస్పదంగా ఉన్న గోనె సంచిని గమనించిన స్థానికులు వెంటనే డయల్ ...