భారతదేశం, ఆగస్టు 30 -- హైదరాబాద్ నగర పరిధిలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నర్సు (21) అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన నగరవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. మొదట దీనిని అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ, పోలీసుల లోతైన విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అది కేవలం మరణం కాదని, అత్యాచార యత్నాన్ని అడ్డుకునే క్రమంలో జరిగిన హత్య అని అధికారులు నిర్ధారించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువతి తన కాళ్లపై తాను నిలబడి కుటుంబానికి ఆసరాగా ఉండాలనే సంకల్పంతో ఏడు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది. మహేశ్వరంలోని బంధువుల ఇంట్లో ఉండేది. ఆ తర్వాత ఒక స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా విధుల్లో చేరింది. ఆసుపత్రి యాజమాన్యం కేటాయించిన గదిలోనే ఉంటూ రోజువారీ విధులు నిర్వర్తించేది.

శనివారం మధ్యాహ్నం తన...