భారతదేశం, ఫిబ్రవరి 28 -- ఔటర్ రింగురోడ్డు ప‌రిధిలోని (CURE) మూడు కార్పొరేష‌న్ల‌కు వ‌ర్తించేలా గ్రేట‌ర్ హైద‌రాబాద్ మ‌హా న‌గ‌ర పాల‌క సంస్థ (GHMC) చ‌ట్టం స్థానంలో కోర్ అర్బ‌న్ చ‌ట్టం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. కోర్ అర్బన్ ప్రాంతంలో అనుమ‌తులు, రుసుమ‌లు, అభివృద్ధి ప‌నుల నిర్వ‌హ‌ణ‌, ఇత‌ర వ్య‌వ‌హారాల‌న్నింటికీ ఆ చ‌ట్టమే ఆధారంగా ఉండాల‌ని సూచించారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్ట‌నున్న 99 రోజుల కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ ప‌రిధిలో చేప‌ట్టే ప‌నులు తొలుత చేప‌డ‌తామ‌న్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలిచ్చారు.

ఈ సందర్భంగా న‌గ‌రంలో వివిధ ప్ర‌దేశాల్లో ర‌ద్దీ త‌గ్గించేందుకు డిజైన్ చేసిన...