భారతదేశం, జూన్ 8 -- హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఉన్న ఓ పబ్‌పై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, నిబంధనల ఉల్లంఘనలు వెలుగు చూశాయి. ఈ రైడ్ లో మహిళా డీసీపీ రితిరాజ్ కీలకంగా వ్యవహరించారు.

కూకట్‌పల్లి డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న రితి రాజ్... ఆదివారం తెల్లవారుజామున స్వయంగా రంగంలోకి దిగారు. 'క్లబ్ మస్తీ'గా ప్రాచుర్యం పొందిన 'కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్' లో అసాంఘిక పనులు సాగుతున్నాయనే పక్కా సమాచారం పోలీసులకు అందింది. దీంతో డీసీపీ రితి రాజ్ ఎవరికీ అనుమానం రాకుండా సాధారణ పౌరురాలిలా అండర్‌ కవర్ వెరిఫికేషన్ నిర్వహించారు. అక్కడ జరుగుతున్న 'గలీజ్ దందా' మొత్తాన్ని తన మొబైల్‌లో సీక్రెట్‌గా షూట్ చేసి.. పక్కా ఆధారాలను సేకరించారు. పరిస్థితిని సమీక్షించిన అనంతరం పబ్‌పై ఆకస్మికంగా దాడి చే...