భారతదేశం, జూలై 27 -- Servant Theft Cases Hyderabad : హైదరాబాద్ నగరంలో ఇళ్లు, ఆఫీసులు, వ్యాపార సంస్థల్లో పనిమనుషుల అవతారంలో వచ్చి చోరీలకు పాల్పడుతున్న ముఠాల పట్ల సిటీ పోలీస్ యంత్రాంగం ప్రజలను తీవ్రంగా అప్రమత్తం చేస్తోంది. పనిమనుషులను చేర్చుకునేటప్పుడు యజమానులు చూపే చిన్నపాటి నిర్లక్ష్యమే నేరగాళ్లకు పెద్ద ఆసరాగా మారుతోందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తగిన ముందస్తు విచారణ, పూర్వాపరాలు తెలుసుకోకుండా పనిలో కుదుర్చుకుంటే కోట్లలో విలువైన సొత్తును పోగొట్టుకోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనుల ఒత్తిడిలో నిరంతరం బిజీగా ఉండే ఐటీ ఉద్యోగులు, ఒంటరిగా నివాసముండే వృద్ధులు, విద్యార్థులే ఈ చోరీలకు ప్రధాన బాధితులుగా మారుతున్నారు. ఇళ్లు, ఆఫీసులు, దుకాణాల్లో బంగారం, నగదు, అత్యంత విలువైన వస్తువులను నిర్లక్ష్యంగా బయట పడేసి వ...