భారతదేశం, జూన్ 22 -- నీట్ (NEET) ప్రవేశ పరీక్షలో మాల్ ప్రాక్టీసింగ్ కు పాల్పడిన తెలంగాణ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాగన్నగూడ జిల్లా పరిషత్ హైస్కూల్ (ZPHS) పరీక్షా కేంద్రంలో వెలుగు చూసింది. కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడిన 18 ఏళ్ల నీట్ అభ్యర్థిని హైదరాబాద్ సిటీ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన విద్యార్థిగా గుర్తించారు.

ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. సదరు విద్యార్థి ఆదివారం ఉదయం 7 గంటలకే పరీక్షా కేంద్రమైన స్కూల్‌కు చేరుకున్నాడు. స్కూల్ కాంపౌండ్ వాల్‌కు ఆనుకుని ఉన్న వాష్ రూమ్ వెంటిలేటర్ ద్వారా లోపలికి చెయ్యి పెట్టి ఒక మొబైల్ ఫోన్‌ను అక్కడ దాచాడు. ఆ తర్వాత ఉదయం 11 గంటల సమయంలో మళ్లీ వాష్ రూమ్‌లోకి వెళ్లి, ఆ ఫోన్‌ పాడవకుండా ఉండేందుకు ఒక జిప్ లా...