భారతదేశం, ఏప్రిల్ 17 -- Shastripuram ROB Flyover in Hyderabad : హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రయాణాన్ని సులభతరం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పాతబస్తీ ఏరియాలో తలపెట్టిన శాస్త్రీపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది.

సికింద్రాబాద్ - ఫలక్‌నుమా - శివరాంపల్లి రైల్వే లైన్‌పై ఎల్‌సీ నంబర్ 7 వద్ద నిర్మించిన ఈ గ్రేడ్ సెపరేటర్ (ఆర్‌ఓబీ)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభిస్తారు. మైలార్‌దేవ్‌పల్లి, ఫలక్‌నుమా ఆర్‌టీసీ బస్ డిపో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.

ఈ వంతెన అందుబాటులోకి రావడం వల్ల పాతబస్తీతో పాటు శివారు ప్రాంతాల ప్రజలకు ఊరట లభించనుంది. రైల్వే లెవల్ క్ర...