భారతదేశం, ఏప్రిల్ 2 -- దోమల నియంత్రణ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వినూత్న రీతిలో నిసరన వ్యక్తం చేశారు. దోమ తెర ధరించి, ఫాగింగ్‌ యంత్రంతో అసెంబ్లీ వద్దకు వచ్చారు. అనుమతి లేదని మార్షల్స్‌ అడ్డుకోగా.. వారిని ప్రతిఘటించారు. అసెంబ్లీ సమావేశాలు జరగని సమయంలో కొత్త నిబంధనలు ఎక్కడివని ప్రశ్నించారు.

ఆ తర్వాత ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమల తీవ్రతకు ప్రజలు హైదరాబాద్‌ నుంచి పారిపోతున్నారని వ్యాఖ్యానించారు. నగరంలో రోజురోజుకు దోమలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దోమల నియంత్రణపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జంటనగరాల్లోని చెరువుల్లో గుర్రపుడెక్క ఆకు అధికంగా పేరుకుపోవడంతో.. వాటిలో దోమలు విస్తృతంగా పెరుగుతున్నాయని తెల...