భారతదేశం, జూలై 2 -- హైదరాబాద్ నగరం, దాని పరిసర ప్రాంతాల్లోని పేద ప్రజల సొంతింటి కలను నైజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. క్యూఆర్ (CURE) పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే టెండర్లు పిలవనుంది. ఈ వివరాలను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఈ లక్ష ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని.. మరో రెండు నుంచి మూడు రోజుల్లో ఈ ల్యాండ్ అక్వైజేషన్ పూర్తి కానుందని స్పష్టం చేశారు.

గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని ధూల్‌పేట ప్రాంతంలో గత ప్రభుత్వ కాలంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 125 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ ఇళ్లకు సంబంధించిన పట్టాలను ...