భారతదేశం, మే 31 -- Hyundai Hybrid SUVs India Launch : భారతదేశంలో ప్రస్తుతం అమ్ముడవుతున్న హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్) ప్యాసింజర్ వాహనాలలో దాదాపు 80 శాతం వాటా టయోటా, మారుతీ సుజుకీ సుజుకీదే ఉంది. ఈ విభాగంలో ఇప్పటివరకు సరైన పట్టు సాధించని కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్.. రాబోయే కొద్ది సంవత్సరాల్లో మార్కెట్‌ను శాసించేందుకు ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందని చెప్పుకోవాలి. తన అత్యంత ప్రజాదరణ పొందిన 'క్రెటా' నెక్ట్స్ జనరేషన్ మోడల్‌తో పాటు వేర్వేరు ధరల శ్రేణిలో 3 సరికొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీలను భారత మార్కెట్​లోకి తీసుకురావడానికి కసరత్తులు చేస్తోంది. ఈ హైబ్రిడ్ ఎస్‌యూవీల లాంచ్ టైమ్‌లైన్, ప్రత్యేకతల వివరాలు ఇక్కడ చూద్దాం.

గత ఆర్థిక సంవత్సరం 2026 (ఎఫ్​వై26) లో భారత్‌లో ఏడాదికి 2 లక్షలకు పైగా సేల్స్ సాధించిన ఏకైక మిడ్‌సైజ్ ఎస్‌యూవీగా క్రెటా సర...