భారతదేశం, మార్చి 16 -- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా మార్చి మొదటి వారంలో భానుడి భగభగలకు అల్లాడిపోయిన అనేక రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లటి కబురు ఇచ్చింది! రానున్న వారం రోజుల్లో దేశంలోని అనేక చోట్ల తేలికపాటి, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తద్వారా ఎండలకు బెంబేలెత్తిపోతున్న ప్రజలకు ఉపశమనం కలుగుతుందని వివరించింది.
ఈ నేపథ్యంలో ఐఎండీ ప్రకారం దక్షిణ, ఉత్తర, ఈశాన్య భారతంలో తాజా పరిస్థితులను, అంచనాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశ రాజధాని దిల్లీలో మార్చి నెల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతూ వచ్చాయి. మరీ ముఖ్యంగా మార్చి మొదటి వారంలోనే పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. మే వరకు ఇదే పరిస్థితి కొనసాగితే ఎలా? అని ప్రజలు భయపడిపోయారు. ఈ తరుణంలో దిల్లీలో ఆదివారం ఉదయం వర్షాలు పడ్డాయి. ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.