భారతదేశం, ఏప్రిల్ 4 -- భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుతం వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. మార్చి 18, 2026న పార్ట్-టైమ్ చైర్మన్ అటాను చక్రవర్తి నైతిక, విలువల కారణాలను చూపుతూ ఆకస్మికంగా రాజీనామా చేయడంతో బ్యాంక్ షేర్లు గత కొన్ని వారాలుగా ఒత్తిడికి లోనవుతున్నాయి. అయితే, ఈ వివాదం అంతటితో ముగిసిపోలేదు. అదనపు టైర్-1 బాండ్లను తప్పుదోవ పట్టించేలా విక్రయించారనే ఆరోపణలపై మరో 12 మంది ఉన్నతాధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న వార్తలు ఇన్వెస్టర్లలో మరింత ఆందోళన కలిగించాయి.

బ్యాంక్ షేర్ల పనితీరుపై సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్, 'లైవ్‌లాంగ్ వెల్త్' వ్యవస్థాపకుడు హరిప్రసాద్ కె స్పందిస్తూ.. ఇది హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ మౌలిక సామర్థ్యం తగ్గడం వల్ల వచ్చిన సమస్య కాదని పేర్కొన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ ...