భారతదేశం, ఏప్రిల్ 18 -- తెలుగు ప్రేక్షకులకు 'దేశముదురు' సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటిపుల్ హీరోయిన్ హన్సిక మోత్వానీ గత కొద్దిరోజులుగా తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు మార్చి 11న హన్సిక మోత్వానీ, ఆమె భర్త సోహైల్ ఖతూరియాకు పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన విడాకుల గురించి మాట్లాడిన హన్సిక మోత్వానీ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చపై తనదైన శైలిలో స్పందించారు.

"జనానికి క్లిక్‌బైట్ వార్తలు కావాలి, అవి వారికి దొరికాయి. హెడ్ లైన్స్ కావాలనుకున్నారు, అవి కూడా వచ్చాయి. వీటిపై నేను ఎప్పుడూ వివరణ ఇవ్వలేదు, ఇకముందు కూడా ఇవ్వను. ఎందుకంటే అవన్నీ నాకు అనవసరం" అని హన్సిక మోత్వానీ స్పష్టం చేశారు.

విడాకుల నిర్ణయం వెనుక ఉన్న భావోద్వేగాలను పంచుకుంటూ హ...