భారతదేశం, మే 3 -- Govinda: బాలీవుడ్ కామెడీ షో 'లాఫ్టర్ చెఫ్స్ 3' వేదికగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. చాలా కాలంగా విడివిడిగా ఉంటున్న గోవింద కుటుంబం, కృష్ణ అభిషేక్ కుటుంబం మధ్య మళ్లీ సఖ్యత కుదిరినట్లు కనిపిస్తోంది. ఈ షోలో గోవింద భార్య సునీత ఆహుజా తన మేనల్లుడు కృష్ణ అభిషేక్, కోడలు కాశ్మీరా షాలను కలిసి ఎమోషనల్ అయ్యారు.

అయితే ఇదే సమయంలో తన భర్త గోవిందపై ఆమె వేసిన సెటైర్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. గోవింద హిట్‌ సాంగ్‌ 'అఖియోం సే గోలీ మారే' (కళ్లతో తూటాలు పేల్చడం)ని ఉదహరిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

2024 అక్టోబర్‌లో బాలీవుడ్ నటుడు గోవింద తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను సర్దుతుండగా ప్రమాదవశాత్తూ కాలికి బుల్లెట్ తగిలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సునీత తాజాగా స్పందిస్తూ.. "కాశ్మీరా, నీకో విషయం చెప్పాలి. భార్యను గౌరవించేవాడే నిజమ...