భారతదేశం, జూన్ 26 -- Godavari Railway Station : గోదావరి పుష్కరాల పనుల కారణంగా రైల్వే ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. రాజమండ్రి సమీపంలోని గోదావరి (GVN) రైల్వే స్టేషన్‌లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో.. జూన్ 26 నుంచి రాబోయే 45 రోజుల పాటు మూడు మెము (MEMU) రైళ్ల నిలుపుదలను తాత్కాలికంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

గోదావరి రైల్వే స్టేషన్‌లో ఆగకుండా నేరుగా వెళ్లే ఆ మూడు రైళ్ల వివరాలను దక్షిణ కోస్తా రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు గమనించాల్సిన రైళ్ల వివరాలు ఇవే:

రాబోయే గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని గోదావరి స్టేషన్‌లో మౌలిక వసతుల కల్పన, లూప్ లైన్లు, ట్రాక్ ఆధునీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనుల దృష్ట్యా రైళ్ల రాకపోకలకు మరియు ప్రయాణికుల భద్రతకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకే...