భారతదేశం, మార్చి 10 -- తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎల్‌పీజీ సిలిండర్లపై ఆందోళన నెలకొంది. ఓ వైపు ప్రభుత్వాలు సరిపోయేంత ఎల్పీజీ ఉందని చెబుతున్నాయి. కానీ మరోవైపు చాలా మంది కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీనిద్వారా అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌పీజీ పరిస్థితిపై ప్రభుత్వం స్పందించింది.

ఏపీలో ఎల్‌పీజీ కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రజలు భయపడవద్దని కోరారు. అధికారులతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా గృహ, వాణిజ్య అవసరాలకు గ్యాస్ సరఫరా, స్టాక్ స్థాయిలను సమీక్షించిన తరువాత, ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని మంత్రి చెప్పారు. విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీ, మంగళూరు నుండి హసన్ చర్లపల్లి పైప్‌లైన్, విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసి సౌకర్యాల నుండి ఎల్‌పీజీ సరఫరాను ట్...