భారతదేశం, మే 4 -- మనిషి జీవనయానంలో 16 సంస్కారాలకు విశిష్ట స్థానం ఉంది. అందులో చివరిదైన 'అంత్యేష్టి' లేదా అంతిమ సంస్కారం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ఆత్మకు ప్రేత యోని నుంచి విముక్తి ప్రసాదించి, పితృ లోకానికి చేర్చే వారధి అని గరుడ పురాణం చెబుతోంది. సాధారణంగా తండ్రికి కొడుకే ముఖాగ్రి ఇవ్వాలని, పిండ ప్రధానం చేయాలని మన సమాజంలో ఒక బలమైన నమ్మకం ఉంది. అయితే, మారుతున్న కాలంలో లేదా అనివార్య కారణాల వల్ల కొడుకు లేని పక్షంలో ఆత్మకు సద్గతి కలగదా? అంటే.. మన శాస్త్రాలు ఇందుకు అద్భుతమైన ప్రత్యామ్నాయాలను సూచించాయి.

గరుడ పురాణం ప్రకారం, అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఒక క్రమ పద్ధతి ఉంది. ఒకవేళ కుమారుడు అందుబాటులో లేకపోయినా లేదా లేకపోయినా ఈ కింది వారు ఆ బాధ్యతను తీసుకోవచ్చు:

మనుమడు లేదా మునిమనుమడు: కుమారుడి కొడుకు (మనుమడు) లేదా మనవడి కుమారుడు (మునిమనుమడ...