భారతదేశం, సెప్టెంబర్ 14 -- దేశమంతటా వినాయక చవితి సంబరాలు మిన్నంటుతున్న వేళ ఆర్థిక రంగానికి నేడు కీలకమైన విరామం లభించింది. పండుగ పురస్కరించుకుని ఈరోజు (సెప్టెంబర్ 14, 2026 - సోమవారం) దేశీయ స్టాక్ మార్కెట్లతో పాటు బ్యాంకింగ్ రంగానికి సెలవు ప్రకటించారు.

బాంబే స్టాక్ ఎక్స్​ఛేంజ్ (బీఎస్​ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్ (ఎన్​ఎస్​ఈ) అందించిన వివరాల ప్రకారం.. ఈక్విటీ విభాగాలు, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్​తో పాటు ఎన్‌డీఎస్-ఆర్‌ఎస్‌టీ, ట్రై-పార్టీ రెపో సెగ్మెంట్లలో వినాయక చవితి కారణంగా నేడు ట్రేడింగ్ పూర్తిగా నిలిచిపోనుంది. తిరిగి మంగళవారం ఉదయం సాధారణ వేళల్లో మార్కెట్లలో ట్రేడింగ్ పునఃప్రారంభమవుతుంది.

అయితే కమొడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ విభాగంలో ట్రేడింగ్ చేసే వారికి మినహాయింపు ఇచ్చారు. తొలి విడతలో అంట...