భారతదేశం, ఏప్రిల్ 28 -- Fuel Supply in Telangana : రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడిందంటూ గత కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పౌరసరఫరాల శాఖ స్పందించింది. రాష్ట్రంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని.. ప్రజలు భయాందోళన చెందవద్దని స్పష్టం చేసింది. వదంతులను నమ్మి ప్రజలు ఆందోళనకు గురికావొద్దని స్పష్టమైన భరోసా ఇచ్చింది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు సమాచారాన్ని చూసి వాహనదారులు బంకుల వద్దకు క్యూ కట్టవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వాహనదారులకు, రవాణా రంగానికి, రైతాంగానికి అవసరమైన ఇంధనం అందుబాటులో ఉందని పౌరసరఫరాల శాఖ తెలిపింది. సామాన్యులను తప్పుదారి పట్టించే ఉద్దేశంతోనే కొందరు ఇంధన కొరత ఉందంటూ ప్రచారం చేస్తున్నారని, ఇది కేవలం పుకారు మాత్రమేనని అధికారులు తేల్చి చెప్పింది. భవిష్యత్తు అవసరాల కోసం ప్ర...