భారతదేశం, ఏప్రిల్ 27 -- Fuel Crisis Telugu States : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. దీంతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. ప్రధాన నగరాల నుంచి పల్లెల వరకు అనేక పెట్రోల్ బంక్‌లు 'నో స్టాక్' బోర్డులను ప్రదర్శిస్తున్నాయి. దీంతో ఇంధనం కోసం వాహనదారులు ఒక బంక్ నుంచి మరో బంక్‌కు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ముఖ్యంగా తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, కోస్తా జిల్లాల్లోని పలు చోట్ల ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన హెచ్‌పీసీఎల్ , బీపీసీఎల్ బంక్‌లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా నిరంతరం రద్దీగా ఉండే బ...