భారతదేశం, జూన్ 26 -- హిందూ ధర్మంలో శుక్రవారానికి ఎంతో విశిష్టత ఉంది. సాక్షాత్తు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజున, భక్తిశ్రద్ధలతో చేసే దీపారాధన ఇంట్లోని దరిద్రానికి చరమగీతం పాడుతుందని పండితులు చెబుతుంటారు. వాస్తు, ఆధ్యాత్మిక అంశాల ప్రకారం, శుక్రవారం సాయంత్రం కొన్ని ప్రత్యేక స్థానాల్లో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే, లక్ష్మీదేవి ఆ ఇంట కొలువై ఉంటుందని ప్రతీతి.

ఇంటి ముఖద్వారం లక్ష్మీదేవి ప్రవేశించే మార్గం. శుక్రవారం సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించడం వల్ల సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇది ఆర్థిక ఇబ్బందులను దూరం చేయడమే కాకుండా, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని బలపరుస్తుంది. ద్వారం వద్ద వెలిగే దీపం, బయటి నుంచి వచ్చే ప్రతికూల శక్తులను అడ్డుకుని, ఐశ్వర్యాన్ని ఆహ్వానిస్తుందని నమ్మకం.

తులసి మొక్క అంటే...