భారతదేశం, ఏప్రిల్ 9 -- సముద్ర వనరుల పరిరక్షణ, నిర్వహణ కోసం భారత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా, రాష్ట్ర తీరప్రాంతంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

1994 నాటి ఏపీ సముద్ర చేపల వేట నియంత్రణ చట్టంలోని సెక్షన్ 4 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి మరియు మత్స్యశాఖ జీవో ఆర్టి నెం 88 ద్వారా ఈ ఉత్తర్వును జారీ చేసింది.

నోటిఫికేషన్ ప్రకారం.. నిషేధ కాలంలో, అవుట్‌బోర్డ్, ఇన్‌బోర్డ్ మోటార్లు (OBM/IBM) కలిగిన వాటితో సహా, రిజిస్టర్ చేయబడిన అన్ని యాంత్రిక, మోటారుతో నడిచే చేపల వేట పడవలు ఏపీ ప్రాదేశిక జలాల్లో కార్యకలాపాలు నిర్వహించకుండా నిషేధిస్తారు.

సాంప్రదాయ మోటారు లేని పడవలకు ఈ నిషేధం నుండి మినహాయింపు ఉంది. చేపలు, రొయ్యల జాతుల సంతానోత్పత్తి కాలా...