భారతదేశం, సెప్టెంబర్ 5 -- జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే స్థానిక వాహనదారులకు భారత జాతీయ రహదారుల సంస్థ(NHAI) డిజిటల్ విప్లవంతో సరికొత్త వెసులుబాటు కల్పించింది. టోల్‌ప్లాజాలకు సమీపంలో నివసించే ప్రజలు డిజిటల్ విధానంలో ఆన్‌లైన్ ద్వారానే ఫాస్టాగ్‌ లోకల్‌ పాస్(FASTag Local Pass) పొందే ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది. గతంలో లోకల్ పాస్ కావాలంటే స్థానిక వాహనదారులు నేరుగా టోల్‌ప్లాజాలకు వెళ్లి, పత్రాలు సమర్పించి నిరీక్షించాల్సి వచ్చేది.

కానీ ఇప్పుడు ఎలాంటి భౌతిక పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఆన్‌లైన్ ద్వారానే నిమిషాల వ్యవధిలో పాస్ పొందే సౌకర్యాన్ని తీసుకొచ్చారు. ఢిల్లీ-అర్బన్ ఎక్స్‌టెన్షన్ హైవేలోని ముండ్కా-బక్కర్వాలా టోల్‌ప్లాజా వద్ద ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా దాదాపు 130 కేంద్రాల్లో దీన్ని...