భారతదేశం, ఏప్రిల్ 29 -- వారాల తరబడి సాగిన హోరాహోరీ ప్రచారం.. నేతల మధ్య మాటల యుద్ధం.. ఓటర్ల తీర్పు.. వెరసి 2026 అసెంబ్లీ ఎన్నికల సమరం ముగింపు దశకు చేరుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని 142 స్థానాలకు బుధవారం జరుగుతున్న రెండో విడత (చివరి దశ) పోలింగ్‌తో ఈ ఎన్నికల కోలాహలం ముగియనుంది. ఇప్పుడు అందరి దృష్టి, ఆసక్తి కేవలం ఒక్క అంశంపైనే ఉన్నాయి.. అవే 'ఎగ్జిట్ పోల్స్'.

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. చివరి ఓటు పడే వరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించడం నిషిద్ధం. బెంగాల్‌లో పోలింగ్ సమయం ముగిసిన వెంటనే, అంటే బుధవారం సాయంత్రం 6:30 గంటల నుంచి వివిధ సర్వే సంస్థలు తమ అంచనాలను ప్రకటించడం ప్రారంభిస్తాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం (RP Act 1951) లోని సెక్షన్ 126A ప్రకారం.. ఏప్రిల్ 9 ఉదయం 7 గంటల నుంచి ఏప్రిల్ 29 సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించ...