భారతదేశం, మే 1 -- తెలుగువారి ఇళ్ళలో సంధ్యా సమయం అయిందంటే చాలు.. గడపకు పసుపు కుంకుమలు రాసి, తులసి కోట ముందు దీపం వెలిగించడం ఒక అనాదిగా వస్తున్న ఆచారం. సూర్యాస్తమయం తర్వాత ఇంటి సింహద్వారం వద్ద దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి (Positive Energy) ప్రవేశిస్తుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని మన పెద్దలు చెబుతుంటారు. దీపం కేవలం చీకటిని మాత్రమే కాదు, మన జీవితంలోని దారిద్య్రాన్ని కూడా తొలగిస్తుందని నమ్మకం. అయితే, కేవలం దీపం వెలిగించడమే కాదు, దాన్ని సరైన పద్ధతిలో ఉంచినప్పుడే ఆ దేవత అనుగ్రహం లభిస్తుంది.

దీపారాధన చేసే సమయంలో చాలా మంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం దీపం వెలిగించేటప్పుడు అనుసరించాల్సిన ముఖ్యమైన నియమాలు ఇవే:

దీపం వెలిగించే ప్రదేశం ఎప్పుడూ అత్యంత శుభ్రంగా ఉండాలి. మురికిగా ఉన్న చోట దీపాన్ని పెట...