భారతదేశం, జూలై 25 -- Etv: తెలుగు టెలివిజన్ రంగంలో ఆదివారం నాన్-ఫిక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో టీఆర్‌పీ (TRP Ratings) పోరు సరికొత్త మలుపు తిరిగింది. గత కొన్ని నెలలుగా జీ తెలుగు, స్టార్ మా ఛానళ్లు తమ ఈవెంట్లు, డ్యాన్స్ అండ్ రియాలిటీ షోలతో ఆదివారం ప్రైమ్‌టైమ్‌ను శాసిస్తుండగా, దానికి బలమైన పోటీ ఇచ్చేందుకు ఈటీవీ (ETV) సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. తమ ప్రధాన ప్రోగ్రామ్‌ల టైమింగ్స్, యాంకర్లు, కాన్సెప్ట్‌లను మారుస్తూ నెట్‌వర్క్ నిర్ణయం తీసుకుంది.

ఆదివారం మధ్యాహ్నం 1:00 గంటకు ప్రసారమయ్యే పాపులర్ షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' (Sridevi Drama Company) లో మేకర్స్ ఊహించని చేంజ్ చేశారు. ఇప్పటివరకు యాంకర్‌గా వ్యవహరించిన రష్మి గౌతమ్ (Rashmi Gautam) స్థానంలో స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) వచ్చాడు. తనదైన కామెడీ టైమింగ్, వన్-లైనర్...