భారతదేశం, జూన్ 26 -- ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన ఏడు కోట్ల మందికి పైగా ఉన్న చందాదారుల కోసం పీఎఫ్ విత్‌డ్రా నిబంధనలను సరళీకరించింది. ఖాతాదారులు తమ అవసరాల కోసం పీఎఫ్ బ్యాలెన్స్ నుంచి నిధులను ఎలా విత్‌డ్రా చేసుకోవచ్చో కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. అయితే, పీఎఫ్ ఖాతాలోని పూర్తి మొత్తాన్ని (100%) ఒకేసారి విత్‌డ్రా చేసుకోవడానికి వీలుందా లేదా అనే అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఆమోదించిన కొత్త నిబంధనల ప్రకారం.. చందాదారులు తమ మొత్తం పీఎఫ్ నిధి నుంచి 50 శాతం నుంచి 77 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతి ఉంది. భవిష్యత్తు అవసరాల కోసం మొత్తం నిధిలో కనీసం 25 శాతాన్ని ఖాతాలోనే ఉంచడం తప్పనిసరి చేశారు. సాంకేతికంగా చెప్పాలంటే, మీ ఖాతాలో ఉండే 'ఎలిజిబుల్ బ్యాలెన్స్' (అర్హత గల మొత్...