భారతదేశం, ఫిబ్రవరి 28 -- ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల ప్రేమ ప్రయాణం పెళ్లి పీటల వరకు చేరింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 26న అత్యంత వైభవంగా విజయ్, రష్మిక వివాహం జరిగింది.

సోషల్ మీడియా వేదికగా తమ పెళ్లి ఫోటోలను పంచుకున్న ఈ జంటకు అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ తన 'వదిన' రష్మికకు అధికారికంగా కుటుంబంలోకి స్వాగతం పలికారు.

ఇక విజయ్, రష్మిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'రణబాలి' (Ranabaali). విరోష్ వెడ్డింగ్ సందర్భంగా ఈ కొత్త జంటకు మ్యారేజ్ గిఫ్ట్‌గా చిత్ర యూనిట్ ఒక సర్‌ప్రైజ్ ఇచ్చింది. రణబాలి సినిమాలో వీరిద్దరి మధ్య సాగే 'ఎందయ్య సామీ' అనే వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు....