భారతదేశం, మార్చి 15 -- దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు, ఆదివారం, మార్చ్​ 15 సాయంత్రం నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. అసోం, పశ్చిమ్​ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదివారం సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశానికి ఆహ్వానం పలికింది.

దీంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎన్నికల నగారా నేడే మోగనుందనే వార్తలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి.

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఈ హై-వోల్టేజ్ ఎన్నికల ప్రకటన వెలువడగానే 'ఎన్నికల ప్రవర్తనా నియమావళి' (మోడల్​ కోడ్​ ఆఫ్​ కాండక్ట్​) తక్షణమే అమల్లోకి వస్తుంది. దీని అర్థం ఏ రాజకీయ పార్టీ కూడా ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా కొత్త పథకాలు లేదా ప్రకటనలు చేయడానికి వీలుండదు. అంతేకాకుండా, రాష్ట్ర యంత్రాంగం అంతా ఎన...