భారతదేశం, మార్చి 18 -- కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ కారణంగా ఎగుమతులకు అంతరాయం కలగడంతో, తెలంగాణ వ్యాప్తంగా గుడ్ల ధరలు భారీగా పడిపోయాయి. ఈ తగ్గుదల వల్ల వినియోగదారులకు ప్రయోజనం జరుగుతోంది. కానీ కోళ్ల పెంపకందారులకు మాత్రం.. నష్టం కలుగుతోంది. మార్కెట్లో అమ్ముడుపోక గుడ్లు పేరుకుపోతుండటంతో కోళ్ల పెంపకందారులు నష్టాలను చూస్తున్నారు.

భారతదేశం పశ్చిమ ఆసియా దేశాలకు లక్షల కొద్దీ గుడ్లను ఎగుమతి చేస్తుంది. అయితే సంఘర్షణ తర్వాత ఎగుమతులు గణనీయంగా మందగించాయి. దీనివల్ల సరఫరా మిగులు ఏర్పడి, తత్ఫలితంగా ధరలు పడిపోయాయి. ఫిబ్రవరి మొదటి వారంలో, గుడ్లు ఒక్కొక్కటి రూ. 7.50 నుంచి రూ. 8 వరకు అమ్ముడయ్యాయి. ఇప్పుడు ఆ ధర సుమారు రూ. 5కి పడిపోయింది. టోకు మార్కెట్‌లో 15 రోజుల క్రితం గుడ్డు ధర రూ. 4.50 ఉండగా, ప్రస్తుతం అది రూ. 4కి తగ్గింది.

ఎగుమతులకు అంతరాయం కలగడమే ...