భారతదేశం, జూన్ 15 -- దేశంలో పాత కార్లు, బైక్‌లు వాడుతున్న వాహనదారులకు ప్రముఖ ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఐసీఐసీఐ లోంబార్డ్ ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 2023 కంటే ముందు తయారైన, ఈ20 ఇంధనానికి అనుకూలంగా లేని పాత వాహనాల్లో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను వాడటం వల్ల ఏవైనా నష్టాలు లేదా ఇంజన్ రిపేర్లు వస్తే.. వాటికి సంబంధించిన కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను తిరస్కరించే అవకాశం ఉందని కంపెనీ స్పష్టం చేసింది.

ఇలాంటి కేసులను వాహనదారుడి "అజాగ్రత్త" లేదా "నిబంధనలకు విరుద్ధంగా వాహనాన్ని వాడటం" కిందికి పరిగణించవచ్చని ఐసీఐసీఐ లోంబార్డ్ తన అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది.

దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి ఈ20 ఇంధన వినియోగాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ప్రస్తుతం అన్ని పెట్రోల్ బంకుల్లో ఇదే ఇంధనం ఎక్కువగా అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ప...