E20 పెట్రోల్తో పాత వాహనాల మైలేజ్ 5% తగ్గొచ్చు.. కానీ ఇంజిన్కు ఎలాంటి ప్రమాదం లేదు: కేంద్రం స్పష్టత
భారతదేశం, జూలై 22 -- దేశవ్యాప్తంగా లభిస్తున్న 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయనే ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. E10 ఇంధనం కోసం డిజైన్ చేసిన పాత వాహనాల్లో E20 పెట్రోల్ వాడటం వల్ల మైలేజ్ స్వల్పంగా (సుమారు 3 నుంచి 5 శాతం వరకు) తగ్గే అవకాశం ఉందని అంగీకరించింది. అయితే, దీనివల్ల ఇంజిన్ భాగాలకు ఎలాంటి తీవ్రమైన నష్టం వాటిల్లదని, వాహనాలు మధ్యలో ఆగిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
వాహనం ఇచ్చే మైలేజ్ అనేది కేవలం ఇంధనం రకంపైనే ఆధారపడి ఉండదని మంత్రి వివరించారు. డ్రైవింగ్ అలవాట్లు, వాహన నిర్వహణ (Maintenance), టైర్లలో గాలి ఒత్తిడి, ఏసీ వాడకం, వీల్ అలైన్మెంట్ వంటి ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.