భారతదేశం, జూన్ 15 -- భారతదేశ ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పడింది. పర్యావరణ పరిరక్షణతో పాటు విదేశీ ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడమే లక్ష్యంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. 'ఈ100' ఇంధన నిబంధనలకు పచ్చజెండా ఊపారు. ఈ నిర్ణయంతో దేశంలో ఇథనాల్ ఇంధన వినియోగం వార్తల్లో నిలిచింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో అప్రమత్తమైన మారుతీ సుజుకీ, టయోటా, ఎంజీ, హ్యుందాయ్ వంటి దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు.. వంద శాతం ఇథనాల్‌తో నడిచే సరికొత్త వాహనాల తయారీపై వేగాన్ని పెంచాయి.

భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించడానికి, దేశీయంగా బయో ఇంధన మార్కెట్‌ను బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుంది. అసలు ఈ100 ఇంధనం అంటే ఏంటి? ఇది పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా పూర్తిగా మారిపోతుందా? దీనివల్ల వాహనదా...