భారతదేశం, మార్చి 1 -- తెలంగాణ రాజకీయ చరిత్రలో కొంతమంది నాయకులు పదవుల వల్ల కాదు, తమ వ్యక్తిత్వం వల్ల గుర్తుండిపోతారు. అధికారపు మెరుపులు క్రమంగా మసకబారినా, వారు అందించిన విలువల వెలుగు మాత్రం చిరస్థాయిగా నిలుస్తుంది. తెలుగు నేలపై అలాంటి వెలుగులు పంచిన నాయకుడు దుద్దిళ్ల శ్రీపాదరావు. మార్చి 2, 1935న కాటారం మండలం ధన్వాడ గ్రామంలో జన్మించిన ఆయన, ఒక సర్పంచ్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి వరకు ఎదిగారు. ఆయన జీవితం మన రాజకీయ సంస్కృతికి చూపిన మార్గాన్ని శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా స్మరించుకోవాలి.

ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన శ్రీపాదరావు బాల్యమంతా పల్లెటూరులోనే గడిచింది. తల్లిదండ్రులు రాధాకృష్ణయ్య, కమలాబాయి ఇచ్చిన విలువలు ఆయన ప్రస్థానానికి పునాదిరాళ్లయ్యాయి. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే ఆయన ధన్వాడలో ప్రాథమిక విద్య, మంథనిలో ఎస...