భారతదేశం, మే 21 -- Mohanlal Drishyam 3 Twitter Review In Telugu: సినిమా ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సంచలన దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'దృశ్యం 3' (Drishyam 3) మే 21, 2026న అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.

జార్జ్‌కుట్టి, అతని కుటుంబం చుట్టూ తిరిగే ఈ ఉత్కంఠభరితమైన కథనం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ రోజు వెండితెరపై అసలైన వినోదం మొదలైంది. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ ఫ్రాంచైజీతో విడదీయరాని బంధం ఉంది. ఇక్కడ విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన రీమేక్‌లు 'దృశ్యం', 'దృశ్యం 2' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఘనవిజయం సాధించాయో అందరికీ తెలిసిందే...