భారతదేశం, మే 24 -- Drishyam 3 Ansiba Hassan On Jihadi Allegations: థియేటర్లలో రికార్డు వసూళ్లతో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'దృశ్యం 3' బాక్సాఫీస్ వద్ద జోరుగా దూసుకుపోతోంది. కానీ, మరోవైపు దృశ్యం 3లో నటించిన నటి అన్సిబా హసన్ చేసిన ఆరోపణలు మలయాళ చిత్రసీమను కుదిపేస్తున్నాయి.

దృశ్యం 3 మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ జార్జ్‌కుట్టి పాత్రగా చేయగా ఆయన కూతురు 'అంజు'గా మెప్పించిన అన్సిబా.. తోటి నటుడు టైని టామ్‌పై సంచలన కామెంట్స్ చేశారు. టైని టామ్‌తోపాటు మలయాళ నటీనటుల సంఘం 'అమ్మ' (AMMA) లోని కొందరు సభ్యులపై అన్సిబా హాసన్ సంచలన ఆరోపణలు చేశారు.

తనను మతపరంగా వేధించడమే కాకుండా క్యారెక్టర్ అస్సాసినేషన్‌కు పాల్పడ్డారని అన్సిబా ఆవేదన వ్యక్తం చేశారు. మలయాళంలో మూడో భాగం అయిన దృశ్యం 3 థియేటర్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న తరుణంలో ఈ అంతర్గత వివాదం...